చెరువులో యువకుడు గల్లంతు – మృతదేహం లభ్యం

Jan 24,2024 12:48 #dead body, #found, #pond, #Youth drown

ప్రజాశక్తి-యర్రావారిపాలెం (తిరుపతి) : మండలంలోని చింతగుంట గ్రామపంచాయతీ ఆది ఆంధ్రవాడకి చెందిన గళ్ళా గణేష్‌ (26) అనే యువకుడు గత ఆదివారం తన తోటి స్నేహితులతో కలిసి రెడ్డి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు చెరువులో గల్లంతయిన గణేష్‌ కోసం గాలించినా అతని ఆచూకీ కనపడలేదు. దీంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు చెరువులో గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పీలేరు, తిరుపతి నుంచి ఫైర్‌ సిబ్బంది వచ్చి గ్రామస్తులతో కలిసి బోట్లు సహాయంతో ముమ్మరంగా చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఆ యువకుడి మఅతదేహం లభ్యం కావడంతో బయటికి తీశారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోవడంతో పీలేరు నుంచి డాక్టర్లు వచ్చి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు. మృతుడి భార్య గర్భవతిగా ఉన్నారు. యువకుడి మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక వైసిపి నాయకులు బాబి మూడు రోజులుగా గ్రామస్తులతో కలిసి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై ఎస్సై ఈశ్వరయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️