
రాయ్పూర్ : దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో తాత్కాలిక లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించాయి. తాజాగా ఛత్తీస్గడ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపధ్యంలో ఛత్తీస్గడ్ రాజధాని రాయ్పూర్లో 11 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 19 వరకు అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఛత్తీస్గడ్లో మంగళవారం 9,921 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా రాయ్పూర్లోనే నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ వైద్య అధికారులతో సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం రాజధానిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఏప్రిల్ 14వ వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.