
మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్యాప్ నిలిచిపోనుంది. సోమవారం (నవంబర్ 30) నుండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మైక్రోసాఫ్ట్ వెబ్ యాప్కి మద్దతు నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను వాడుకోవాలనుకుంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని ఉపయోగించాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో వినియోగదారులందరినీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ను ఉపయోగించుకునేలా చేయాలని సంస్థ నిర్ణయించింది. ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి వాటితో పోటీ నేపథ్యంలో ఈ కొత్త వెబ్ బ్రౌజర్ను తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. 2021, ఆగస్టు 17 నుండి ఆఫీస్ 365, వన్డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్ప్లోరర్ 11కు సపోర్ట్ చేయవని తెలిపింది. దశలవారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 9, 2021 తరువాత నుండి ఎడ్జ్ లెగస్సీ డెస్క్టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్డేట్స్కు బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్డేట్స్తో అందుబాటులో ఉండనుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కూడా క్రోమ్ బ్రౌజర్ లాగా సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. 25 సంవత్సరాల క్రితం... 1995లో ఆగస్టులో విడుదలైంది.