
హైదరాబాద్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన 'అల్లుడు అదుర్స్' చిత్రంలో 'గజ'గా మెప్పించారు సోనూసూద్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది. శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో సోనూసూద్ మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు హర్షధ్వానాలతో చప్పట్ల మోత మోగింది. ఆ వేదికపై హీరోకి కూడా లభించనంత ఆదరణ ఈయనకు లభించింది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన సోనుసూద్ తెలుగు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'అందరికీ నమస్కారం.. తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను తెలుగు, తమిళం.. ఇలా ఏ ఇండిస్టీకి సంబంధించిన వేదికపై ఉన్నా తెలుగు ఇండిస్టీనే నాకు మొదటి ప్రేమ అని కచ్చితంగా చెప్పగలను. నేను సినిమాల్లో నేర్చుకుంది ఏదైనా ఉందంటే అది తెలుగు ఇండిస్టీ ద్వారానే. కాబట్టి తెలుగు సినిమాకు నా ధన్యవాదాలు. తెలుగు సినిమాతోనే తెలుగు వారితో నాకు అనుబంధం ఉంది. తెలుగు వారు నాకు ఫ్యామిలీ. ఎందుకంటే నా భార్య తెలుగు అమ్మాయి. కాబట్టి నేను తెలుగు అల్లుడిని' అంటూ చెప్పుకొచ్చారు.
'అల్లుడు అదుర్స్' సినిమా గురించి మాట్లాడుతూ.. నిర్మాత బెల్లంకొండ సురేష్తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. 'మీరు కథ చెప్పకున్నా.. స్క్రిప్ట్ వివరించకున్నా పర్లేదు.. ఫోన్ చేసి సోనూ సినిమా ఉంది రా.. అంటే నేను వచ్చేస్తా.. ఎందుకంటే మీరంటే అంత ఇష్టం నాకు.' అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్తో జర్నీ కొనసాగుతుంది. కందిరీగ, అల్లుడు అదుర్స్తో మంచి సినిమాలు ఇచ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్ చాలా టాలెంటెడ్ అని, మంచి హార్డ్ వర్కర్ అని, ఇతను బాలీవుడ్లోకి స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.