
భారత్లో పెట్రోలు ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. రోజుకో విధంగా కొత్త రికార్డు స్థాయిలో పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారమవుతోంటే.. నిత్యావసర వస్తువలపై కూడా దీని ప్రభావం తీవ్రతరమై సామాన్యుని మరింత ఇబ్బందుల్లోకి నెడుతోన్నాయి.
మొదట 5 రోజులు చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటకీ... బుధవారం నుంచి మళ్లీ ధరల వడ్డింపు పెరిగింది. సంక్రాంతి పండుగ వేళ కూడా పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. గురువారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 25 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.84.70 కి చేరింది. డీజిల్పై కూడా 25 పైసలు వడ్డించడంతో.. లీటర్ డీజిల్ ధర రూ.74.88కు పెరిగింది. తాజాగా.. పెరిగిన పెట్రోల్ ధరలు జైపూర్లో కొత్త రికార్డును సృష్టించాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.92.54 కి, డీజిల్ రూ.84.53 కి పెరిగింది. పెట్రోల్ ధర భారతదేశంలోనే అత్యధిక రేటు పలికింది. మరోవైపు.. జైపూర్లో డీజిల్ ధరలు రూ.81 ను దాటాయి. దేశంలోనే అత్యధికంగా డీజిల్ ధర హైదరాబాద్లో రూ. 81.72 కు చేరింది. మొత్తంగా పెట్రోల్ ధరలు.. హైదరాబాద్లో రూ.88.11, కోల్కతాలో రూ.86.15, ముంబైలో 91.32, చెన్నైలో రూ.87.40, బెంగళూరులో రూ.87.56, భువనేశ్వర్ రూ.85.36, పాట్నాలో రూ.86.73గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర కోల్కతాలో రూ.78.47, ముంబైలో రూ.81.60, చెన్నైలో రూ.80.19, బెంగళూరు రూ.79.70, హైదరాబాద్లో రూ.81.72, పాట్నాలో రూ.80.46కు పరుగులు తీస్తున్నాయి.