భారత వాయుసేన తన భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐదవ శ్రేణి యుద్ధవిమానాల అభివృద్ధి కోసం ఒప్పందాల క్రమంలో తొలి ఒప్పందం మీద భారత్, రష్యాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి ఈ వారాంతంలో రష్యాప్రధాని వ్లాదమిర్ పుతిన్ జరిపే భారత్ పర్యటనలో వీటిని ఖరారు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే గురువారం నుంచి పుతిన్ రెండు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిమితులను మార్చి 10 తరువాత నిర్ణయిస్తామని యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్లోని వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో ఇంత వరకు భారత్ ఒక్కటే భాగస్వామిగా చేరిందని ఆవర్గాలు వెల్లడించాయి.