పాకిస్తాన్ మార్గల్లా పర్వతాన్ని డీకొన్న విమాన బ్లాక్ బాక్స్ కోసం ప్రత్యేక బృందాలు వేట ప్రారంభించాయి. బుధవారం సంభవించిన దుర్ఘటనలో 155 మంది మరణించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, మంచు తుఫానులతో కూడిన ప్రతికూల వాతావారణ పరిస్థితుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. బ్లాక్ బాక్స్ను చేజిక్కించుకుంటేగానీ విమాన ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియరావు. డామన్ ఇ కోహ్ ప్రాంతానికి సమీపంలో పర్వతానికి ఢకొీన్న విమానం దానికి రెండు వైపుల చెల్లాచెదురుగా పడిపోయిన సంగతి తెలిసిందే.