నేడు ప్రజాపథం జరిగే ప్రాంతాలివే...

సోమవారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 31వ డివిజన్‌ టైనర్‌ పేటలోని సిఎస్‌ఐ స్కూల్‌లో ఉదయం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు 49వ డివిజన్‌ ఎర్రకట్ట డౌన్‌ పాతరాజ రాజేశ్వరిపేటలో జరగనుంది. ఈ కార్యక్రమాలకు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. సెంట్రల్‌ నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన 59వ డివిజన్‌లోని బివి సుబ్బారెడ్డి స్కూల్‌లో ఉదయం 7 నుండి, తూర్పు నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యే యలమంచిలి రవి అధ్యక్షతన 9వ డివిజన్‌లో స్కావెంజర్‌ కాలనీలో ఉదయం 8 గంటలకు, 8వ డివిజన్‌లో పిఅండ్‌టి కాలనీ క్రాస్‌రోడ్డులో సాయంత్రం 3 గంటలకు ప్రజాపథం జరగనుంది.