హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బికె

బికె.పార్థసారధి

          అనంతపురం : టిడిపి హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా బికె.పార్థసారథిని ఆ పారీట అధిష్టానం ఖరారు చేసింది. బికె.పార్థసారధి గతంలోనూ పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. 1999లో ఆయన హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2004లో ఇదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత నుంచి ఆయన పెనుకొండ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి తప్పించి తిరిగి పార్లమెంటు బరిలో దింపేందుకు టిడిపి సిద్ధమైంది. కురుబ సామాజిక తరగతి అధికంగానున్న ఈ ప్రాంతంలో ఈయనకు టికెట్టు ఇవ్వడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని టిడిపి భావిస్తోంది.

➡️