‘స్పందన’కు వినతుల వెల్లువ

Feb 5,2024 20:56

‘స్పందన’కు వినతుల వెల్లువ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనలో జిల్లా కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌లతో కలసి జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 218 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా రెవెన్యూ శాఖకు సంబంధించి 167, జిల్లా ఉపాధి కల్పన శాఖ 2, పోలీసు శాఖ 7, డిఆర్‌డిఏ 4, విద్యాశాఖ 2, ఎపిఎస్‌ పిడిసిఎల్‌ 3, ఐసిడిఎస్‌ 2, డిపిఓ 1, ఎండోమెంట్‌ 1, డిసిహెచ్‌ఎస్‌ 2, జిల్లా స్పోర్ట్స్‌ 1, ఎన్విరాన్మెంట్‌ ఇంజనీరింగ్‌ పొల్యూషన్‌ బోర్డు 1, ఏపిఎస్‌ఆర్‌టిసి 2, సర్వేశాఖ 2, జిల్లా ఖజానాశాఖ 1, జిల్లామైనారిటీ వెల్ఫేర్‌ శాఖ 1, సోషల్‌ వెల్ఫేర్‌ 1, నేషనల్‌ హైవే 1, జిల్లా ఫారెస్ట్‌ 1, జవ్‌ ళి శాఖ 1, ఎంపిడిఓ బంగారుపాళ్యం 1, హౌసింగ్‌ శాఖ 4, ఇతరులు10 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, డిఆర్‌ఓలకు తమ వినతులను అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️