స్పందన అర్జీలకు పూర్తిస్థాయి పరిష్కారం

Jan 29,2024 22:07
స్పందన అర్జీలకు పూర్తిస్థాయి పరిష్కారం

ప్రజాశక్తి-అమలాపురం జగనన్నకు చెబుదాం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతప్తికరమైన పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోనిగోదావరి భవన్‌లో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమం జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరు హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబుతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కారించవలసిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలకు తదితర సంబంధించి మొత్తం 214 అర్జీలు వచ్చాయి. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. అర్జీదారుల విన్నపాలను సావధానంగా విని ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారించి ఆన్‌లైన్‌ చేస్తూ నిబంధనల మేరకు సంతప్తికరంగా పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలన్నారు. ఒకే అంశంపై పదే పదే అర్జీలు నమోదు కాకుండా, గడువు దాటిన అర్జీలు లేకుండా అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి పి.నారాయణమూర్తి, వికలాంగులు సిఆర్‌ఒ వై.శ్రీరామ్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️