సిరిసిల్ల వస్త్ర రంగంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి : కెటిఆర్‌

తెలంగాణ : సిరిసిల్ల వస్త్ర రంగంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై కెటిఆర్‌ స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్‌ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని కెటిఆర్‌ డిమాండ్‌ చేశారు. గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివఅద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్‌లూమ్‌ నేతన్నలు, అభివఅద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని చెప్పారు. గత పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని కెటిఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పవర్‌ లూమ్‌ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్‌ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయనీ అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళుతుందని కెటిఆర్‌ పేర్కొన్నారు.

➡️