- ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి-బుచ్చయ్య పేట(అనకాపల్లి జిల్లా) : బుచ్చయ్యపేట మండలం కొన్నెంపూడి జంక్షన్ గుట్టలుగా ఉన్న సర్వే రాళ్లకు అధికారులు సున్నం వేశారు. ఈ రాళ్లకు కోడ్ వర్తించదా? అనే శీర్షికతో ప్రజాశక్తిలో వెలువడిన కథనానికి స్పందించిన అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బుచ్చయ్యపేట మండలం కొన్నెంపూడి జంక్షన్ గుట్టలుగా ఉన్న సర్వే రాళ్లపై జగనన్న భూ రక్ష పేరు ఉండడంతో ప్రజాశక్తి దినపత్రికలో మంగళవారం వార్త ప్రచురణ కావడంతో రెవెన్యూ అధికారులు ఎన్నికల సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంగళవారం ఉదయమే అధికారులు సిబ్బందితో వెళ్లి సర్వే రాళ్లపై ఉన్న జగనన్న భూ రక్ష పేర్లపై సున్నాన్ని పూసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.