అనంతపురం ఎస్ఎస్ఎస్ బిఎన్లో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమి
అనంతపురం : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలతో మొదలయ్యాయి. 55 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా కేంద్రంలోకి అనుమతి ఉండదన్న నిబంధనతో విద్యార్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్, కెఎస్ఆర్ జూనియర్ కళాశాల్లో జరుగుతున్న పరీక్షలను కలెక్టర్ ఎం.గౌతమి పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు.