ప్రజాశక్తి – జీలుగుమిల్లి
సచివాలయల ద్వారా జరిగే సంక్షేమ పథకాల అమలుకు సిబ్బంది మరింతగా కృషి చేయాలని జిల్లా ట్రైనింగ్ కో ఆర్డినేటర్ ప్రసంగి రాజు పేర్కొన్నారు. మండలంలోని సచివాలయ సిబ్బందికి రిఫ్రెషర్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా మంగళవారం రెండో రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయల ద్వారా ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అదేవిధంగా సిబ్బంది పనిచేసే సమయంలో ఒత్తిడికి గురి కాకుండా పారదర్శకంగా పని చేయాలని సూచించారు. అనంతరం కమ్యూనికేషన్ స్కిల్స్, సాప్ట్వేర్ ప్రాబ్లమ్స్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కృష్ణప్రసాద్, అడ్మనిస్ట్రేషన్ అధికారిని మంగతాయారు, ఇఒపిఆర్డి నిఖిల్ సాయి శరణ్, పంచాయతీ కార్యదర్శిలు, విఆర్ఒలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.