శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌గా అన్సారియా

శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎ.తమీమ్‌ అన్సారియాను ప్రభుత్వం

తమీమ్‌ అన్సారియా

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎ.తమీమ్‌ అన్సారియాను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈమెను కమిషనర్‌గా ఆదివారం నియమించింది. 2015వ బ్యాచ్‌ యూపి కేడర్‌ ఐఎఎస్‌ అధికారి. ఉత్తరప్రదేశ్‌లో 2017లో పాఠశాల విద్య సహాయ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో ఉత్తరప్రదేశ్‌లోనే పఠేపూర్‌ జిల్లా చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిచేశారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ అడిషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. డాక్టర్‌ మనజిర్‌ జిలానీ సమూన్‌్‌ను వివాహం చేసుకున్న తరువాత 2020లో ఎపి కేడర్‌కు కేటాయించారు. 2022 ఏప్రిల్‌ నుంచి 2023 మే వరకు అన్నమయ్య జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ప్రసూతి సెలవులో ఉన్నారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఆమెను ఫౌజ్‌ కోటా కింద శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం కమిషనర్‌ చల్లా ఓబులేసు 2020 జూన్‌ 23న నగర కార్పొరేషన్‌ సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఓబులేసు బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. మున్సిపల్‌ పరిపాలనశాఖ అన్సారియాకు నియామక ఉత్తర్వులు తరువాత ప్రస్తుత కమిషనర్‌ బదిలీపై ఒక నిర్ణయం వెలువడుతుందని అధికారులు భావిస్తున్నారు.

 

➡️