శిద్దా వెంకట సుబ్బారావు మృతి

ప్రజాశక్తి -చీమకుర్తి : మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు, శ్రీవాసవీ గ్రానైట్‌ అధినేత శిద్దా వెంకట సుబ్బారావు(84) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైద రాబాదులో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. మంగళ వారం చీమకుర్తిలో వెంకట సుబ్బారావు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. వెంకట సుబ్బారావు కుమారులు శిద్దా హనుమంతరావు, శిద్దా సుధాకర్‌ను పరా మర్శించారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, టిటిడి బోర్డు సభ్యుడు శిద్దా సుధీర్‌కుమార్‌, శిద్దా పాండురంగారావు, శిద్దా నాగేశ్వరరావు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, శిద్దా కృష్ణారావు, కృష్ణసాయి గ్రానైట్స్‌ అధినేత శిద్దా హనుమంతరావు దంపతులు, యాపిల్‌ గ్రానైట్‌ అధినేత శిద్దా సూర్యప్రకాశరావు దంపతులు, శిద్దా సురేష్‌ దంపతులు, శిద్దా బాలాజీ దంపతులు, శిద్దా ఆంజనేయప్రసాదు, శిద్దా సాయిబాబు, శిద్దా పెద్దబాబు, టిడిపి నాయకులు కాట్రగడ్డ రమణయ్య, యడ్లపల్లి రామబ్రహ్మం, గొల్లపూడి సుబ్బారావు, కందిమళ్ళ గంగాధరరావు, గోల్డెన్‌ గ్రానైట్‌ మేనేజర్లు గిరిబాబు, ఫణికుమార్‌, కామాక్షి గ్రానైట్‌ మేనేజర్‌ శిద్దా శ్రీనివాసరావు, శిద్దా పవన్‌కుమార్‌, చల్లగండ్ల హనుమంతరావు, బొమ్మిశెట్టి కిరణ్‌, నూకల సుబ్రహ్మణ్యం, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఉన్నారు.

➡️