ప్రజాశక్తి – యు.కొత్తపల్లి
అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందచేశారు. సోమవారం మండలంలోని కొత్తమూలపేటలోని అరబిందో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ సెజ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, మహిళల సాధికారతకు ప్రాధాన్యం కల్పిస్తూ అరబిందో ఫార్మా ఫౌండేషన్ కాకినాడ సెజ్ పరిధిలో రెండు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ యువత నగర యువతతో సమానంగా పోటీ పడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేం దుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లోనూ ఈ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా యువత, మహిళలకు శిక్షణ ఇస్తున్న ప్రతిభ కేంద్రం కృషి అభినందనీయమని తెలిపారు. అనంతరం ప్రతిభ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకునన 77 మంది యువకులకు సెజ్ అధికారులు మంతా శ్రీనివాస్, వీరారెడ్డి, కాకినాడ లైఫియస్ ఫార్మా మేనేజర్ ఎ.శ్రీనివాస్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.