శబరిమల యాత్రికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త..

Jan 4,2024 15:20 #sabarimala, #trip, #tsrtc

హైదరాబాద్‌: తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్తను తెలిపింది.తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్తను తెలిపింది. కేరళలోని అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి శబరి వెళ్లే ప్రతి ప్రయాణికుడికి రూ. 13,600 చొప్పున చార్జీ ఉంటుంది. కాగా ఈ ఛార్జ్‌ లోనే బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ సౌకర్యం ఉంటాయి. జనవరి 5వ తేదిన అంటే శుక్రవారం నాడు లహరి బస్సు ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరి మొత్తం 7 రోజుల్లో శబరికి తీసుకెళ్లి తిరిగి ఎంజీబీఎస్‌ బస్టాండ్‌కు చేరుకుంటుంది.

➡️