షోరూమ్ను ప్రారంభిస్తున్న ఎంపి ఆదాల
వ్యాపారం అభివృద్ధి చెందాలి
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్:నగరంలోని చిన్న బజార్లో ఫయాజ్ ఆధ్వర్యంలో ఇమ్రాన్ జ్యూవెలర్స్ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్న ఫయాజ్ తన మూడవ బ్రాంచ్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కస్టమర్లకు నాణ్యమైన, ఆధునిక మోడల్స్ అందించడంలో ఎంతో పేరు కలిగిన ఫయాజ్ వ్యాపారం అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి , ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర రెడ్డి, ఫయాజ్ జ్యూవెలర్స్ అధినేత ఫయాజ్, జెడ్పిటిసి సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, పాశం తిరుపతి, ఇమ్రాన్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.