వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులుగా ధనరాజు

Jan 27,2024 23:11

ప్రజాశక్తి – బాపట్ల
వ్యవసాయ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా అద్దంకి వ్యవసాయ సహాయ సంచాలకులు కె ధనరాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సంతమాగులూరు ఎఒ ఆర్ లావణ్య, కార్యదర్శి అద్దంకి ఎఒ వెంకటకృష్ణ, కోశాధికారిగా అమృతలూరు ఎఒ లోకేశ్వరి, సంయుక్త కార్యదర్శి జిల్లా రైతు శిక్షణ కేంద్రం ఎఒ ఆర్ విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్ సత్తార్, ఇంచార్జ్ ఎడిఎ విజయనిర్మల సమక్షంలో నిర్వహించిన నూతన కార్యవర్గం ఎంపికలో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు బాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి మురళీ కిషోర్, ప్రేమ సాగర్ పాల్గొన్నారు.

➡️