వృద్ధులు,  చిన్నారులకు దుప్పట్లు,టవల్స్‌ పంపిణీ

Mar 3,2024 14:54 #Annamayya district

 ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్య) : తమ ఫౌండేషన్‌ ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు యంగ్‌ ఇండియా సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు తగాది రాజశేఖర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిస్వార్ధమైన సేవే లక్ష్యంగా ఫౌండేషన్‌ స్థాపించామన్నారు. ఇందులో భాగంగా ఆదివారం బెంగళూరు నగరం సమీపంలోని హౌససకోట వద్ద గల విద్యారణ్య ఆశ్రమంలో సుమారు 280 మంది వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులకు దుప్పట్లు, టవల్స్‌ అందజేయడం జరిగిందన్నారు. సేవా కార్యక్రమాల్లో సంస్థ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. అటు ఏపీ ఇటు కర్ణాటకలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

➡️