ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్.సుందరరావు మాట్లాడుతూ, మండలంలోని దివ్యాంగ పిల్లలందరూ భవిత కేంద్రాన్ని సధ్వినియోగం చేసు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఇఆర్పి ఏ.కిరణ్ కుమార్, పి.కల్యాణి, సిబ్బంది పార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.