వినుకొండ ఫొటోగ్రాఫర్లకు శివనంది అవార్డులు

వినుకొండ: శ్రీ కాళహస్తి లోని ఎస్విఎస్‌ కల్యాణ మండపం లో ఆదివారం జరిగిన ప్రైడ్‌ ఇండియా కల్చర్స్‌ నత్యోస్తం కార్యక్రమం. ప్రైడ్‌ ఇండియా కల్చర్‌ అండ్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఫార్మ్‌ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో అత్యంత ప్రతిభ కనబర్చిన కళా కారులకు అవార్డ్స్‌ అందజేసి దుశ్శాలవాలతో సత్కరించారు. ఫోటోగ్రఫీ రంగంలో అత్యంత ప్రతిభ కనబర్చిన పల్నాడు జిల్లా వినుకొండ కు చెందిన ఫోటోగ్రాఫర్‌ లు వంగపల్లి బ్రహ్మయ్య, కేశానపల్లి సుబ్బారావులకు శివ నంది అవార్డ్స్‌ అందజేశారు. వీరితో పాటు నాట్యం, వైద్య, రంగాలలో ప్రతిభ కనబర్చిన కళాకారులను సన్మానించారు.

➡️