విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం
విద్యార్థులకు అభినందనలు
ప్రజాశక్తి – లింగసముద్రం లింగసముద్రంలోని కమ్మిశెట్టి రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ పరీక్షను గురువారం నిర్వహించారు. జనవిజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు జి.మహేంద్ర పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి హెచ్ఎం ఎం.కొండయ్య మాట్లాడుతూ ఇలాంటి పరీక్షలు విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీయ డానికి దోహదపడతాయన్నారు. పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కిశోర్,లక్ష్మీగీతిక,సాయివివేక్,ప్రవేట్ పాఠశాలల పరుపున పెదపవనిలోని శ్రీప్రతిభ బాల విద్యాలయం విద్యార్థులు మహిత,సుప్రియ,తేజశ్వంత్ మొదటి స్థానం పొందారు. వీరు జనవరి 7న జరిగే జిల్లా స్థాయి పరీక్షకు హాజరుకావాలని జెవివి జిల్లా నాయకులు టివి.కృష్ణకుమార్ తెలిపారు.కిలారి వెంకటేశ్వర్లు, కె.ప్రభాకర్,ప్రదీప్రాజ్,రసూల్,మాల్యాద్రి ఉన్నారు.