విద్యార్థుల ప్రతిభ

Jan 27,2024 00:33

ప్రజాశక్తి -జి.మాడుగుల: ఇటీవల కడపలో రాష్ట్రస్థాయి చైన్‌ స్క్వేర్‌ పోటీల్లో బొయితిలి పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు బి, చంటిబాబు, తవుడు బాబు ప్రతిభ చాటారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాల్గొన్న విద్యార్థులకు శుక్రవారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అప్పలకొండ ప్రశంస పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బొయితెలి మాజీ సర్పంచ్‌ తమర్బ రాంబాబు, పిడి ఉపాధ్యాయులు మాలన్న పాల్గొన్నారు.

➡️