పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమయారెడ్డి నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. సంగీతాన్ని రథన్ అందించారు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.