ఫొటో : విజయసాయిరెడ్డికి స్వాగతం పలుకుతున్న వైసిపి నేతలు
విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం
ప్రజాశక్తి-కావలి రూరల్ : రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైసిపి ఎంపి అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా తొలిసారిగా జిల్లాకు వస్తున్న విజయసాయిరెడ్డికి కావలి రూరల్ మండల పరిధిలోని రుద్రకోట జాతీయ రహదారిపై ఎంఎల్ఎ రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కావలి నియోజవర్గం నుంచి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. విజయసాయిరెడ్డి అక్కడకు చేరుకోగానే భారీ గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు ఎంపి అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరు ప్రకటించగానే టిడిపి నాయకుల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. వైసిపిని మోసం చేసి వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం విజయసాయిరెడ్డిని 600 కార్లతో భారీ ర్యాలీగా కావలి పట్టణంలో నుంచి నెల్లూరుకు వెళ్లారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి, కందుకూరు పరిశీలకులు మన్నెమాల సుకుమార్రెడ్డి, ఎఎంసి చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్యాదవ్, కనుమలపూడి నారాయణ, కామరాజు, జెడ్పిటిసి జంపాని రాఘవులు, మాజీ జెడ్పిటిసి కందుల శ్రీనివాసులు, కావలి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.