వికలాంగుడికి ట్రై సైకిల్‌ అందజేత

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం
మానవసేవే మాధవ సేవగా భావించి బొప్పన రాధమ్మ వికలాంగులకు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాంచంద్రశేషు, నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు పల్లి శ్రీను అన్నారు. టిడిపి మండల అధ్యక్షులు సాయల సత్యనారాయణ ఆధ్వర్యంలో నడవలేని స్థితిలో ఉన్న వికలాంగుడు అప్పారావుకు బొప్పన రాధమ్మ ఆర్థిక సహాయంతో వీల్‌ ట్రై సైకిల్‌ అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అన్నపరెడ్డి గంగాధర్‌, జిల్లా కార్యదర్శి బొబ్బర రాజ్‌పాల్‌ కుమార్‌, పాతురి అంబేద్కర్‌, చట్టిబోయిన రామలింగేశ్వరావు పాల్గొన్నారు.

➡️