క్రికెట్ జట్టును అభినందిస్తున్న రిజిస్ట్రార్, అధ్యాపకులు
ప్రజాశక్తి- ఎచ్చెర్ల
డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తరఫున సౌత్జోన్ అంతర్వర్సిటీ పోటీలకు క్రికెట్ జట్టు ఎంపికలు గురువారం ముగిశాయి. రెండురోజుల పాటు శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ ఎంపికలు జరిగాయి. ‘వర్సిటీ పరిధిలో 28 కళాశాల నుంచి 89 మంది విద్యార్థులు ఈ ఎంపికులకు హాజరుకాగా మొదటిరోజు 22 మందిని ఎంపిక చేశారు. గురువారం జరిగిన తుది పోటీల్లో గెలిచిన జట్టును అంతర్ వర్సిటీ పోటీలకు ఎంపిక చేశారు. చెన్నైలోని హిందుస్థాన్ డీమ్డ్ యూనివర్సిటీలో ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగే సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుంది. జట్టు సభ్యులకు వర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, స్పోర్ట్స్ అసిస్టెంట్ డీన్ డా.బి.వి.రమణమూర్తి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.ఎం.శ్రీనివాస్, అధ్యాపకులు డా. ఎ.భాస్కర్ అభినందనలు తెలిపారు.