వడదెబ్బకు వృద్ధుడు మృతి

Mar 9,2024 20:42 #died, #old man, #sun stroke

ప్రజాశక్తి- తిరుపతి సిటీ :వడదెబ్బకు వృద్ధుడు మృతి చెందాడు. అలిపిరి సమీపంలోని దివ్యారామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పిచ్చాటూరుకు చెందిన పి.దేసిరెడ్డి (80) అలిపిరి ప్రాంతంలో భిక్షాటన చేస్తూ దివ్యారామం ప్రాంతంలో బస వేసేవాడు. శనివారం బహిర్భూమికి వెళ్లిన ఆ వఅద్ధుడు చేతిలోని కర్రతోపాటు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వాకర్స్‌ సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే ఆ వృద్ధుడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగానే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కొడుకు సతీష్‌ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️