వంద కుటుంబాలు టిడిపిలో చేరిక

Feb 16,2024 20:22

 ప్రజాశక్తి- విజయనగరం కోట : విజయనగరం మండలం బడుకొండపేటకు చెందిన వైసిపి నాయకులు పాశి అప్పలనాయుడు, డొప్ప అప్పలనాయుడు, దువ్వు గురుమూర్తి, బడుకొండ చిన్న సత్యం తదితర వంద కుటుంబాలు టిడిపిలో చేరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పోలిట్‌ బ్యూరో సభ్యలు పూసపాటి అశోక్‌ గజపతి రాజు , నియోజకవర్గ ఇంఛార్జి పూసపాటి అదితి విజయలక్ష్మి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌ , మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️