హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానకూల సంకేతాలతో మన మార్కెట్టు కళకళలాడాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427కి చేరుకుంది. నిఫ్టీ 130 పాయింట్లు పుంజుకుని 22,041కి పెరిగింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన కరెన్సీ మారకం విలువ రూ. 82.04గా ఉంది.