రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ లక్నోలో ప్రారంభమైంది. రవితేజ త్వరలోనే ఈ సెట్స్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. లక్నోలో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.