రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల

గుండుగొలను-కొవ్వూరు జాతీయ రహదారిపై ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గుండుగొలను నుంచి కొవ్వూరు వైపు వెళుతున్న మోటారుసైకిలిస్టును ఎదురుగా వస్తున్న కారు ఢకొీంది. ఈ సంఘటనలో మోటార్‌ సైకిలిస్ట్‌ ఘటనాస్థలిలో మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి భీమడోలు మండలం గుండుగొలను గ్రామ వాసిగా భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

➡️