రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Mar 28,2024 22:48

ప్రజాశక్తి – రామభద్రపురం/సాలూరు : విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని కొట్టక్కి బస్సు షెల్టర్‌ సమీపాన గురువారంరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు బలంగా ఢకొీనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో సాలూరు పట్టణంలోని గొల్లవీధికి చెందిన గొంటుబోయన యశోద కృష్ణ (22), గొట్టేడ శ్రీను (45), రామభద్రపురం మండలం జన్నివలసకు చెందిన జొన్నాడ పురుషోత్తం (26) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన జన్నివలసకు చెందిన జి.రామప్రసాద్‌, జి.శరత్‌గణేష్‌కు సాలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. సాలూరు నుంచి యశోదకృష్ణ, శ్రీను, మరొకరు బైకుపై వస్తుండగా, ఎదురుగా పురుషోత్తం బైకును ఢకొీన్నారు. ఈ సంఘటలో పై ముగ్గురు మృతి చెందారు. సంఘటనా స్థలం రెండు బైకులు చెల్లాచెదురాయ్యయి. కేసును రామభద్రపురం ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.

➡️