రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించిన ఎంఎల్‌ఎ

ప్రజాశక్తి – ఆచంట (పెనుమంట్ర)

నెగ్గిపూడి లాకుల వద్ద సోమవారం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌ సైకిళ్లు ఢకొీనడంతో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. అటుగా వస్తున్న ఆచంట ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు 108కి ఇచ్చిన సమాచారం మేరకు సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన ప్రయివేటు ఎలక్ట్రీషన్‌ పెనుగొండ వైపు బైక్‌పై వెళ్తుండగా అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న పిప్పరకు చెందిన మరోవ్యక్తి ఢకొీన్నారు. అదే సమయంలో ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు కారు ఆపి గాయాలపాలైన ఇద్దరిని అంబులెన్స్‌లో ఆసుపత్రి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని హాస్పటల్‌ వైద్యాధికారులకు ఫోన్‌ ద్వారా ఆదేశించారు. ఈ మేరకు ఎంఎల్‌ఎ మానవత్వాన్ని చాటుకున్నారు.

➡️