రోడ్డు ఇలా.. నడిచేదెలా..?

డ్రెయినేజీ నీరు చేరడంతో బురదమయమైన రహదారి

ప్రజాశక్తి-బొమ్మనహాల్‌

మండల పరిధిలోని దర్గాహొన్నూరు గ్రామంలో రోడ్లు బురదమయమై ఉన్నాయని, రాకపో కలు సాగించడమెలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో వెంటనే డ్రెయినేజీ కాలువలు శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామానికి చెందిన రైతు బోయ పోతప్ప మాట్లాడుతూ గ్రామంలోని జుమ్మా మసీదు నుంచి ఎర్రగుంట ఎల్లప్ప ఇంటి వరకూ డ్రెయినేజీ నీరు సీసీ రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుధ్యం పడకేయడం, ఎక్కడికక్కడ చెత్తచెదారం పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నా ప్రజాప్రతినిధులు కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ పట్టించుకోవడం లేదన్నారు.

➡️