రోజూ వ్యాయామం చేయాలితిరుపతి ఆటా వాక్‌ థాన్‌లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం

రోజూ వ్యాయామం చేయాలితిరుపతి ఆటా వాక్‌ థాన్‌లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం

రోజూ వ్యాయామం చేయాలితిరుపతి ఆటా వాక్‌ థాన్‌లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు రోజూ గంట పాటు నడకను నిత్యవ్యాయామంగా అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం విద్యార్థులకు సూచించారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో ఉదయం ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో తారకరామా స్టేడియం నుండి మహతి ఆడిటోరియం వరకు జరిగిన వాక్‌ థాన్‌ 2023 కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి వాక్‌ థాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యాయామాన్ని ప్రతిరోజు తమ నిత్యఅలవాటుగా మార్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలమని అన్నారు. అలాగే యువత ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రత్యేక దష్టి సారించి యోగ, మెడిటేషన్‌ వంటి కార్యక్రమాలను అలవర్చుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియా ద్వారా ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను సమాజానికి అందించి మంచి సాధనంగా వినియోగించాలని ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం సూచించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రభుత్వాలకు అందిస్తున్న తోడ్పాటును వివరించారు. ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌, ఆటా వేడుకల చైర్‌ జయంత్‌ చల్లా మాట్లాడుతూ ఆటా చేపడుతున్నటువంటి సమాజ సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. కార్యక్రమంలో ఆటా ట్రెజరర్‌ సతీష్‌రెడ్డి, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీమ్‌రెడ్డి, ట్రస్టీ కాశీకొత్త, మీడియా కోఆర్డినేటర్‌ ఈశ్వర్‌ బండా, అనిల్‌కుమార్‌ బోయినపల్లి,ఎస్వీ యూనివర్సిటీ రూషా విభాగం అధికారి వంశీ, ఎస్‌వియు అధ్యాపకులు, పాల్గొన్నారు.

➡️