రోగులకు అందుబాటులో ఉండాలి : ఎమ్మెల్యే

Jan 5,2024 20:05

ప్రజాశక్తి-బొబ్బిలి  :  ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరారు. ఆసుపత్రిలో శుక్రవారం ఆసుపత్రి అభివద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆసుపత్రిలలో మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పలు సమస్యలపై చర్చించి పరిష్కారానికి తీర్మానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు జి.శశిభూషణరావు, రాంనరేష్‌, రవిశంకర్‌, సాయికష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️