రైల్వేకోడూరు టిడిపి ఇన్‌ఛార్జిగా ‘ముక్కా’

ప్రజాశక్తి-రైల్వేకోడూరు తెలుగుదేశం పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రూపానందరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా రూపానందరెడ్డి మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఆదేశాలతో తనను టిడిపి ఇన్‌ఛార్జిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అహర్నిశలు కషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సీనియర్‌ టిడిపి, జనసేన నాయకులందరితో కలిసి పనిచేస్తానన్నారు.

➡️