బైక్ర్యాలీలో పాల్గొన్న నాయకులు
కదిరి అర్బన్ : రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని సిఐటియు, రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలను నిరసిస్తూ శుక్రవారం సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి బంగ్లా నుండికాలేజ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, నాయకులు వివి రమణ, శివన్న, వేమన్న, శ్రీరాములు, సిఐటియు నాయకులు జిఎల్ నరసింహులు, జగన్మోహన్, రామ్మోహన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ, తిరుపాలు, బాలకృష్ణ, జనార్ధన, ఎస్ఎఫ్ఐ నాయకులు విజరు , జిలాన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను సవరించిందని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయడంలో విఫలమైందని విమర్శించారు. మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా చర్యలకు పాల్పడుతుందని అన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.