రైతు భరోసా కేంద్రం ప్రారంభం

ప్రజాశక్తి-పొన్నలూరు మండలంలోని చెన్నిపాడులో బుధవారం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాన్ని మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ఆదిమూలపు సురేష్‌ ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, మారుమూల గ్రామాలలో నిర్మించడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. వచ్చే ఎన్నికలలో మీరందరూ ముఖ్యమంత్రిగా జగన్‌ అన్నను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ పి బాలకోటిరెడ్డి, ఎంపీపీ కె మాధవరావు, జడ్‌పిటిసి బి వెంకటేశ్వర్లు, మండలంలోని వైసిపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️