నేడు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం

Mar 27,2024 08:57 #Nara Chandrababu, #paryatana

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఈ నెల 27న చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ప్రజాగళం యాత్ర చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 10.15గంటలకు కుప్పం ఆర్‌అండ్‌బి అతిధి గృహం నుంచి బయలుదేరి 10.25 గంటలకు బెగ్గిలిపల్లి పిఇఎస్‌ మెడికల్‌ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో పలమనేరు లోని రాజేష్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన 10.55కు బయలుదేరి 11గంటలకు పలమనేరులోని వివి మహల్‌ సమీపంలోని జావలి వీధికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో 11నుంచి 12.30గంటలకు పాల్గంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1.45గంటలకు బయలుదేరి 2,30 గంటలకు పుత్తూరు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో 2.30 గంటల నుంచి 4 గంటల వరకు పాల్గంటారు. మధ్యాహ్నం 4.10గంటలకు బయలుదేరి 5గంటలకు మదనపల్లి చేరుకుంటారు. సాయంత్రం 5.30 నుంచి 7.30గంటల వరకు సమావేశంలో పాల్గంటారు. రాత్రి 7.30గంటలకు బయలుదేరి మదనపల్లెలోని బెంగళూరు రోడ్డులోని శ్రీరామ్‌ కాంప్లెక్స్‌ చేరుకుంటారు. రాత్రికి అక్కడే చంద్రబాబు బసచేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

➡️