రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Feb 22,2024 14:51 #cc roads

అరకు : రూ.5లక్షల జిల్లాపరిషత్‌ నిధులతో బంగారుమెట్ట పంచాయతీ పరిధిలో గల సొలగంపుట్టు గ్రామంలోని సిసి రోడ్డు నిర్మాణ పనులను వైసిపి మండల ఇన్‌చార్జి కొండలరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సొలగంపుట్టు గ్రామాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తే నేడు జగన్‌ ప్రభుత్వంలో సమస్య పరిష్కారమైందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు జగన్నాధం, మోహన్‌, శంకర్‌ , గ్రామస్తులు పాల్గొన్నారు

➡️