రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు : సజ్జల

ప్రజాశక్తి-అమరావతి : రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారనిఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి విమర్శించారు. సీనియర్‌ పాత్రికేయుడు విజయబాబు రచించిన ‘మహాదోపిడీ’ అనే పుస్తకాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారు కాబట్టే 2019లో ఓటుతో బుద్ధి చెప్పారని వివరించారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి చంద్రబాబు ఏ విధంగా దోపిడీ సాగించారో అందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు దష్టంతా మళ్లీ అధికారం చేజిక్కించుకోవడంపైనే ఉందని, అందుకోసం పవన్‌ కల్యాణ్‌ ను, బీజేపీని వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారం కోసం చివరి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.

➡️