రాజంపేట అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించాలి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ సీటును జనసేన పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోలాటం హరికష్ణ, కత్తి సుబ్బరాయుడు, ఆకుల చలపతి, గురువుగారి వాసు, ఇడిమడకల సాయి శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం మన్నూరులోని యల్లమ్మ ఆలయం వద్దనున్న జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవనంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి రాజంపేటలో పార్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే సత్తా కలిగిన రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని జనసేనకు కేటాయిస్తే రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని తమ నాయకుడు పవన్‌ కళ్యాణ్‌కు కానుకగా అందజేస్తామని తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట జనసేనకు అత్య ధిక ఓటు బ్యాంకు కలిగి ఉందని, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ జనసేన పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రజాదరణ కలిగిన రాజంపేట నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే అఖండ మెజారిటీతో గెలిపించుకుని జనసేన జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్‌ భారతాల, పలుకూరి శంకర్‌, బండ్ల రాజేష్‌, నంద్యాల హరి, ఏనుగుల మల్లి, గాజుల మల్లికార్జున, ముత్యాల చలపతి, పూల మురళీ, నామాల శంకర్‌, రాజేష్‌ వర్మ పాల్గొన్నారు.

➡️