టెన్నికాయిట్ ఆడుతున్న క్రీడాకారులు
ప్రజాశక్తి- పలాస
పలాస జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న 47వ జాతీయ టెన్నికాయిట్ పోటీల్లో పురుషులు, మహిళా క్రీడాకారులు పాల్గొని తమ సత్తాను చాటారు. రెండో రోజు గురువారం పురుషుల విభాగం క్వాటర్ ఫైనల్ టెన్నికాయిట్ విభాగంలో ఒడిశాపై తమిళనాడు జట్టు, తెలంగాణపై కేరళ జట్టు, మహారాష్ట్రపై పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్పై కర్ణాటక జట్లు విజయం సాధించింది. అలాగే మహిళా విభాగంలో క్వారట్ ఫైనల్ పోటీల్లో పశ్చిమబెంగాలపై తమిళనాడు జట్టు, తెలంగాణపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్పై కేరళ జట్టు, కర్ణాటకపై పాండిచ్చేరి జట్లు విజయం సాధించింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్లెడ్లైన్స్ వెలుగుల్లో జరిగిన ఈ పోటీలు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు వై.డి.రామారావు, రాష్ట్ర కార్యదర్శి కె.ఎన్.వి.సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి పి.తవిటయ్య, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, రాష్ట్ర వ్యాయామ విద్య, ఉపాధ్యాయ సంఘం ముఖ్య సలహాదారులు పి.సుందరరావులు పర్యవేక్షించగా స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు పి.తవిటయ్య, హరిబాబు, డి.రామారావు, పద్మలోచనలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడలను ఆడించారు