రద్దయిన దళిత స్కీములు అమలు చేయాలి

ప్రజాశక్తి – పాలకొల్లు

వైసిపి ప్రభుత్వంలో రద్దయిన 27 దళిత స్కీములు అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేలా పాలకొల్లు నియోజకవర్గ దళిత ప్రాంతాల్లో ఇంటింటా ప్రచార కార్యక్రమం తలపెట్టినట్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు తెలిపారు. రద్దయిన 27 దళిత స్కీములను అమలు చేయాలని బుధవారం టిడిపి కార్యాలయంలో కరపత్రాలను టిడిపి దళిత నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో దళిత స్కీములు రద్దు చేయడమే కాకుండా దాడులు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు వంటివి పెరిగాయన్నారు. ప్రధానంగా ఎస్‌సి ఉప ప్రణాళిక నిధులను నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పటికైనా దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం దళిత స్కీములు అమలుతో పాటు ఎస్‌సి ఉప ప్రణాళిక నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్‌సి నాయకులు పాల్గొన్నారు.

➡️