యుపిఎస్‌సిలో మెరిసిన పవన్‌

టీవల విడుదలైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) పరీక్షా ఫలితాల్లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో మండలంలోని

 

ప్రజాశక్తి- సోంపేట

ఇటీవల విడుదలైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) పరీక్షా ఫలితాల్లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో మండలంలోని పలాసపురానికి చెందిన ఎన్‌.పవన్‌ 65వ ర్యాంకు సాధించాడు. స్థానిక పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న పవన్‌ సోంపేటలోని ప్రయివేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. ఆంధ్రా యూనివర్సిటీలో జి లాజికల్‌ విభాగంలో ఎంఎస్‌సి పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగాల్లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ చేస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన యుపిఎస్‌సి పరీక్షలో జిలాజికల్‌ విభాగంలో ఆల్‌ ఇండియా స్థాయిలో 65వ ర్యాంకు పొంది మైన్స్‌ విభాగంలో ఉద్యోగం సాధించాడు. అతని విజయంపై తల్లిదండ్రులు బబులిరావ్‌, శ్రీదేవి, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.

➡️